- Advertisement -
తన తొలి చిత్రం బబుల్ గమ్లో తన అద్భుతమైన నటనతో అలరించిన యంగ్ హీరో రోషన్ కనకాల ప్రస్తుతం ’మోగ్లీ 2025’లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నింగ్ ’కలర్ ఫోటో’ డైరెక్టర్ సందీప్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా మేకర్స్ మారేడుమిల్లిలో బిగ్ క్లైమాక్స్ యాక్షన్ షెడ్యూల్ పూర్తి చేశారు. 15 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో మాసీవ్ యాక్షన్ సీక్వెన్స్లని షూట్ చేశారు. ఈ నెలలోనే టీజర్ రిలీజ్ చేయబోతున్నారు.
- Advertisement -