- Advertisement -
హైదరాబాద్: బిఆర్ఎస్ అవినీతిలో కూరుకుపోయిందని బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ మండిపడ్డారు. బిఆర్ఎస్ నేతలను రప్పా,రప్పా జైలులో వేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సిఎం రేవంత్ రెడ్డి ఉదయం బిఆర్ఎస్ ను బెదిరించి (threatening BRS) సాయంత్రం మిలాఖత్ అవ్వొద్దు అని సూచించారు. ములాఖత్ అయితే కాంగ్రెస్ కు పుట్టగతులు ఉండవు అని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు తప్ప, ఎవరూ గెలవరు అని చెప్పారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ కు ఓటమి తప్పదు అని హెచ్చరించారు. ఈ నెల 29న జిల్లాలో అమిత్ షా పర్యటన చేయనున్నారని ఎంపి అర్వింద్ పేర్కొన్నారు.
- Advertisement -