Sunday, June 8, 2025

కాళేశ్వరం డిజైన్ బాధ్యత పూర్తిగా కెసిఆర్ దే: కొండా విశ్వేశ్వర్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ బాధ్యత పూర్తిగా మాజీ సిఎం కెసిఆర్ దేనని బిజెపి ఎంపి కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చర్చలో హరీష్ రావు గానీ, ఎంపి ఈటల రాజేందర్ గానీ లేరని ఆయన చెప్పారు. ఈ మేరకు శనివారం కొండా మీడియాతో మాట్లాడుతూ.. ఈటలకు సపోర్టు్ చేసేందుకు రాలేదని.. నిజాలు చెప్పేందుకు వచ్చానన్నారు. ఈటల, కెసిఆర్ కు మద్దతుగా మాట్లాడారంటే వందశాతం తప్పు అని, గులాబీ జెండా అందరిదంటే ఈటలను తన్ని తరిమేశారని అన్నారు. ప్రాణహిత అసాధ్యమని ఆనాడే చెప్పానని.. రాయలసీమ కోసం తెలంగాణను బుజ్జగించేందుకు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఇచ్చారని అయన అన్నారు. పేరుకే చేవెళ్ల కానీ.. కాంగ్రెస్ మాయమాటలు చెప్పి మోసం చేశారని.. చేవెళ్లకు ఒక్క చుక్క నీరు రావన్నారు. కెసిఆర్‌కు విషయమంతా చెప్పి బిఆర్‌ఎస్‌లో చేరానని కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News