మరో సారి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చినట్లు మెదక్ ఎంపి రఘనందన్ రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రఘునందన్ రావు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో కాలికి శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ కగార్ ఆపాలంటూ రెండు వేరు వేరు నెంబర్ల నుంచి వ్యక్తులు ఫోన్ చేశారని, ఎంపి హస్పటల్ నుంచి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆంధ్రప్రధేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు ఐదు బృందాలు రంగంలోకి దిగాయని, దమ్ముంటే కాపాడుకోవాలని సవాల్ విసిరినట్లు ఆయన తెలిపారు. మా ఫోన్లు ట్రాప్ చేసేందుకు యత్నిస్తున్నారని,
తమ సమాచారం దొరకదని, ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నామని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని బెదించినట్లు ఎంపి పేర్కొన్నారు. కాగా జూన్ 23వ తేదీన ఎంపి రఘునందన్కు తొలిసారి బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో డిజిపి, మెదక్, సంగారెడ్డి ఎస్పిలకు ఆయన ఫిర్యాదు చేయగా విచారించిన అధికారులు రఘునందన్కు భద్రత పెంపోందించారు. ప్రభుత్వ ఎస్కార్ట్ వాహనంతో పాటు అదనపు భద్రత కల్పించింది. ఈ నేపథ్యంలో మరో సారి కాల్ రావడం కలకలం రేపుతోంది.