Saturday, September 13, 2025

జిడిపిలో ఎంఎస్‌ఎంఇ లు పది శాతం వాటా సాధించాలి:మంత్రి శ్రీధర్ బాబు

- Advertisement -
- Advertisement -

రాష్ట్ర జిడిపిలో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఇ)ల వాటా పది శాతం ఉండేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తమ ప్రభుత్వం ఎంఎస్‌ఎంఇ నూతన పాలసీని రూపొందించినట్టు ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. శనివారం నాడు ఆయన శంషాబాద్‌లో ఏర్పాటైన గో-నేషనల్- ఎక్స్ పో 2025 ఐదో ద్వైవార్షిక సదస్సును ప్రారంభించిన సందర్భంగా నిర్వాహకులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు తెలిపారు. దాదాపు 4 వేల మంది పారిశ్రామికవేత్తలు పాల్గొన్న ఈ సదస్సును బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషనల్ (బిఎన్‌ఐ) నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు జరిగే ప్రదర్శనతో పాటు వివిధ అంశాలపై సదస్సులు జరుగుతాయి. మంత్రి మాట్లాడుతూ నూతన సాంకేతికత, డిజిటలైజేషన్లతో ఎంఎస్‌ఎంఇలు ఎప్పటికప్పుడు ఆధునీకరించుకునేలా తమ ప్రభుత్వం సహకరిస్తోందని శ్రీధర్ బాబు వివరించారు. తక్కువ వడ్డీతో రుణ సదుపాయం, నిధుల సమీకరణకు అన్ని రకాలుగా తోడ్పాటును అందిస్తున్నట్టు తెలిపారు.

Also Read: ‘జూబ్లీ’ రేసులో నేనూ ఉన్నా: మాజీ ఎంపి అంజన్ కుమార్ యాదవ్

ఎస్‌ఎంఎస్‌ఇలలో లక్షలాది మంది ఉపాధి పొందుతున్నారని తెలిపారు. ఇది అత్యంత ప్రాధాన్యతా రంగంగా పేర్కొన్న మంత్రి వచ్చే రెండు నెలల్లో కృత్రిమ మేథ నూతన ఆవిష్కరణల హబ్ ను ప్రారంభిస్తామని అన్నారు. చిన్న పరిశ్రమల ఉత్పాదనల ఎగుమతులకు రాష్ట్రంలో రెండు డ్రైపోర్టులను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. హైదరాబాద్‌కు పశ్చిమాన ముంబయి వైపు ఒకటి, తూర్పున కాకినాడ వైపు మరొకటి నెలకొల్పుతామని స్పష్టం చేశారు. ప్రదర్శనలో రెండు వందల ఎంఎస్‌ఎస్‌ఇలు తమ తయారీలను ప్రదర్శించడం సంతోషంగా ఉందని కొనియాడారు. పారిశ్రామిక వేత్తలంతా ఒక వేదికపై కలుసుకుని పరస్పర సహకారం, భాగస్వామ్యాలను పెంపొందించుకోవాలని మంత్రి ఆకాంక్షించారు. బిజినెస్ నెట్ వర్క్ ఇంటర్నేషన్ ఈ సంకల్పాన్ని చేపట్టడం ప్రశంసనీయమని అన్నారు. సదస్సులో ఉత్పత్తుల ప్రదర్శన, వివిధ అంశాలపై సమావేశాలతో పాటు బేకింగ్, ఫుడ్ ఇన్నోవేషన్, ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ స్టయిలింగ్ ఫోటోగ్రఫీ, వాణిజ్య ప్రకటనలపై పోటీలు జరిగాయి.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News