- Advertisement -
గౌహతి: అస్సాంలోని పలు జిల్లాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 24 గంటల్లో కామ్రూప్(మెట్రో) జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి పిల్లలతో సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ASDMA) వెల్లడించాడు. వరదలు కామ్రూప్, కామ్రూప్ (మెట్రో), కాచర్ మూడు జిల్లాలను ప్రభావితం చేశాయని, ఐదు రెవెన్యూ సర్కిళ్లపై, 10,150 మందికి పైగా ప్రజలను ప్రభావితం చేశాయని ASDMA పేర్కొంది.
గౌహతిలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షపాతం కారణంగా గౌహతిలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధమయ్యాయని చెప్పారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోవడం, స్థానికంగా కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని ASDMA హెచ్చరించింది.
- Advertisement -