Friday, June 6, 2025

లంచం తీసుకుంటూ పట్టుబడ్డ మున్సిపల్ ఆర్‌ఐ

- Advertisement -
- Advertisement -

కొత్త ఇంటి నిర్మాణం కోసం అసెస్మెంట్ నెంబర్ కేటాయించడానికి సంబంధిత ఇంటి యజమాని నుండి డబ్బులు డిమాండ్ చేస్తూ ఎసిబికి దొరికిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పట్టణంలోని నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఆర్‌ఐగా విధులు నిర్వహిస్తున్న సంతోష్‌కుమార్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి షోయబులు ఇంటి నిర్మాణం కోసం యజమాని నుండి డబ్బులు డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఎసిబిని సంప్రదించడంతో వారిద్దరిని ఎసిబి డిఎస్పి విజయ్ కుమార్ కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సందర్భంగా డిఎస్పి విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలలో లంచం అడగడం నేరమని అన్నారు. అరెస్టు చేసిన ఇద్దరిని శుక్రవారం కరీంనగర్ కోర్టు హాజరుపరిస్తామని పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News