హైదరాబాద్: తాజాగా హీరోయిన్ రష్మిక మందనా కుబేర సినిమాలో నటించింది. కుబేర మూవీ వంద కోట్ల క్లబ్బులో చేరింది. సికిందర్ సినిమా మినహా ఆమె నటించిన సినిమాలు బ్లాక్బస్టర్గా నిలిచాయి. ఇప్పుడు రష్మిక మరో సినిమాల్లో నటిస్తున్ననని ప్రకటించింది. రవీంద్ర పూలే దర్శకత్వం వహిస్తున్న మైసా సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఐదు భాషాల్లో ఫాన్ ఇండియా లెవల్లో ఈ చిత్రాని విడుదల చేయనున్నారు. మైసా మూవీ నుంచి రష్మిక భయంకరమైన అవతారంలో కనిపించే పోస్టర్ను విడుదల చేయడంతో ఆమె అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
ఈ సినిమాను అనుఫార్ములా ఫిల్మ్ అనే సంస్థ నిర్మిస్తుంది. ‘ధైర్యం ఆమె బలం, సంకల్పంలో లేదు కనికరం, ఆమె గర్జన వినడానికి కాదు, భయపెట్టడానికి’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఫొటో చూస్తే ఆమె ఈ సినిమాలో వీర వనితగా కనిపించనున్నట్టు సమాచారం. గతంలో తాను ఇలాంటి పాత్ర పోషించలేదని రష్మిక తెలిపారు. భిన్నమైన, ఉత్తేజకరమైన సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తానని వివరించారు. మైసా లాంటి సినిమాలో తన పాత్ర భిన్నమైందని పేర్కొన్నారు. తాను ఎప్పుడు అడుగు పెట్టని ప్రపంచంలోకి అడుగుపెడుతున్నానని వివరణ ఇచ్చారు. ఈ చిత్రాన్ని పేక్షకుల ముందుకు తీసుకరావడానికి తాను ఎంతో ఉత్సాహంగా ఉన్నానని స్పష్టం చేశారు. రష్మిక చేతిలో ‘ది గర్ల్ ఫ్రెండ్’, ‘థామా’ చిత్రాలు ఉన్నాయి. మైసా షూటింగ్ పూర్తి అయిన తరువాత ఆమె పుష్ప-2 సీక్వెల్లో నటించనున్నారు.