Wednesday, April 30, 2025

లవ్లీ మెలోడీ లాంచ్ చేసిన వరుణ్ తేజ్..

- Advertisement -
- Advertisement -

బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తన అప్ కమింగ్ క్రైమ్-కామెడీ డ్రామా ‘చౌర్య పాఠం’తో మూవీ ప్రొడక్షన్‌లోకి అడుగుపెడుతున్నారు. యంగ్ టాలెంటెడ్ ఇంద్రా రామ్‌ను హీరోగా పరిచయం చేస్తున్నారు. కార్తికేయ-2 మొదలైన చిత్రాలకు చందూ మొండేటి వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పని చేసిన నిఖిల్ గొల్లమారి ఈ మూవీతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నక్కిన నెరేటివ్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ మూవీకి వి చూడమణి సహ నిర్మాత. ఈ చిత్రం టీజర్ థ్రిల్లింగ్ క్రైమ్, డార్క్ హ్యూమర్ బ్లెండ్‌తో అద్భుతమైన స్పందనను దక్కించుకుంది. నాగ చైతన్య లాంచ్ చేసిన ప్రమోషనల్ సాంగ్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. అలాగే ఆడ పిశాచం సాంగ్ వైరల్ అయ్యింది.

శుక్రవారం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమా నుంచి ‘ఒక్కసారిగా’ సాంగ్ లాంచ్ చేశారు. దావ్‌జాండ్ ఈ సాంగ్ లవ్లీ మెలోడీగా కంపోజ్ చేశారు. అనురాగ్ కులకర్ణి సాంగ్‌ని పాడిన విధానం మరింత ఆకట్టుకుంది. కృష్ణకాంత్ రాసిన లిరిక్స్ బ్యూటీఫుల్‌గా వున్నాయి. ఈ సాంగ్ లో లీడ్ పెయిర్ కెమిస్ట్రీ ఆకట్టుకుంది. ఈ సాంగ్ ఇన్‌స్టంట్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో పాయల్ రాధాకృష్ణ కథానాయికగా నటిస్తుండగా, రాజీవ్ కనకాల, మస్త్ అలీ ముఖ్యమైన కీలక పాత్రలను పోషిస్తున్నారు. ‘చౌర్య పాఠం’ ఏప్రిల్ 18న థియేటర్లలోకి రాబోతోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News