Wednesday, June 18, 2025

నాగర్ కర్నూల్ లో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలంలో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు డివైడర్ ను ఢీకొట్టడంతో  ఒక మహిళ మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. భక్తులు శ్రీశైలం నుంచి కర్నాటకకు వెళ్తుండగా ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News