లండన్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదు టెస్ట్ల సిరీస్లో ఇంగ్లండ్ 1-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. జూన్ 2వ తేదీన ఇరు జట్లు మధ్య రెండో టెస్ట్ జరుగనుంది. ఈ టెస్ట్ కోసం ఇంగ్లండ్ తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టులో ఫాఫ్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కి చోటు దక్కింది. అయితే ఈ నిర్ణయాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసెర్ హుస్సేన్ (Nasser Hussain) తప్పుబట్టారు.
గాయాల కారణంగా 2021 నుంచి ఆర్చర్ జట్టుకు దూరమ్యాడు. ఇప్పుడు మళ్లీ అతనికి జట్టు నుంచి పిలుపు వచ్చింది. అయితే నాసెర్ మాత్రం అతన్ని జట్టులో తీసుకొని ఇంగ్లండ్ పెద్ద రిస్క్ తీసుకుంటుందని నాసెర్ హుస్సేన్ (Nasser Hussain) పేర్కొన్నారు. ఆర్చర్ ఏ స్థాయిలో ఫిట్గా ఉన్నాడో తనకు తెలియదని తెలిపారు. అయితే ఆర్చర్ కోసం ఇప్పుడు జట్టు నుంచి ఎవరిని తప్పిస్తారని ప్రశ్నించారు. తనకు తెలిసి ఇఫ్పుడు జట్టులో మార్పులు అవసరం లేదని.. ఆర్చర్ను ఆడించే విషయంలో లార్డ్స్ టెస్ట్ వరకూ ఎదురుచూస్తే మంచిదని సలహా ఇచ్చారు.