- Advertisement -
మన తెలంగాణ/ హైదరాబాద్: జాతీయ సబ్ జూనియర్ రోయింగ్ పోటీలు బుధవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర మంత్రి కొండా సురేఖ, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి పోటీలను ప్రారంభించారు. నగరంలోని హుస్సేన్ సాగర్లో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్లో దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన బాలబాలికలు పాల్గొంటున్నారు. చిన్నారుల్లోని ప్రతిభను వెలికి తీయాలనే లక్షంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నారు. ఆరంభోత్స కార్యక్రమంలో శాట్స్ విసి ఎండి సోనీ బాలాదేవి, రోయింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, రాష్ట్ర సంఘం అధ్యక్షుడు మిథున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -