Monday, June 16, 2025

నీట్ యుజి ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

రాజస్థాన్‌కు చెందిన మహేశ్‌కుమార్‌కు ఫస్ట్‌ర్యాంక్
మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష అవదియకు రెండో
ర్యాంకు తెలంగాణకు చెందిన జీవన్ సాయి
కుమార్‌కు 18వ ర్యాంకు ఆంధ్రపదేశ్‌కు చెందిన
కార్తీక్ రామ్‌కు 19వ ర్యాంకు

మన తెలంగాణ/హైదరాబాద్: దేశంలో వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యుజి 2025 ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలలో రాజస్థాన్‌కు చెందిన మహేష్‌కుమార్ దేశంలోనే మొ దటి ర్యాంకు సాధించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన ఉత్కర్ష్ అవధియాకు రెండో ర్యాంకు, క్రిషాంగ్ జోషి మూడో ర్యాంకుకు దక్కింది. అలాగే ఢిల్లీ కి చెందిన మృణాల్ కిషోర్ ఝాకు నాలుగో ర్యాంకు, అవికా అగర్వా ల్‌కు ఐదో ర్యాంకు లభించింది. దేశవ్యాప్తంగా 22,09,318 మంది వి ద్యార్థులు పరీక్షలు రాయగా 12,36, 531 మంది అర్హత సాధించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టిఎ) తెలిపింది. ఇటీవల ఎన్‌టిఎ నీట్ యుజి పరీక్ష ప్రాథమిక కీ విడుదల చేసి, అభ్యంతరాలు స్వీకరించింది. వాటిని పరిగణనలోకి తీసుకున్న ఎన్‌టిఎ శనివారం తుది సమాధానాల కీ తో పాటు ఫలితాలను విడుదల చేసింది.

విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి https://neet.nta.nic.in/ వెబ్‌సైట్ ద్వారా స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో మే 4వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుంచి 5.20 గంటల మధ్య నీట్ యుజి పరీక్ష నిర్వహించారు. దేశవ్యాప్తంగా 552 కేంద్రాలతో పాటు దేశం విదేశాలలో 14 నగరాలలో నీట్ యుజి పరీక్షను నిర్వహించారు. ఎంబిబిఎస్, బిడిఎస్, బిఎస్‌ఎంఎస్, బియుఎంఎస్, బిహెచ్‌ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా ఈ పరీక్ష నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇంగ్లిష్, హిందీ, తెలుగుతో పాటు మొత్తం 13 భాషల్లో పరీక్షను నిర్వహించారు.

సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
నీట్ – యుజి ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు సత్తాచాటారు. తెలంగాణ నుంచి 41, 584 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్‌కు నుంచి 36,776 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణకు చెందిన కాకర్ల జీవన్ సాయి కుమార్‌కు 18వ ర్యాంకు సాధించారు. ఎపికి చెందిన దర్బా కార్తీక్‌రామ్ కిరీటికి 19వ ర్యాంకు దక్కింది. తెలంగాణకు చెందిన షణ్ముఖ్ నిషాంత్‌కు 37, మంగారి వరుణ్‌కు 46, యండ్రపాటి షణ్ముక్‌కు 48వ ర్యాంకు వచ్చింది. అలాగే ఎపికి చెందిన కొడవటి మోహిత్ శ్రీరామ్‌కు 56వ ర్యాంకు, దేసిన సూర్యచరణ్‌కు 59, పొదిలపు అవినాశ్‌కు 64వ ర్యాంకు, యర్రా సమీర్‌కుమార్‌కు 70వ ర్యాంకు సాధించారు. తుమ్మూరి శివ మణిదీప్‌కు 92వ ర్యాంకు దక్కింది. తెలంగాణకు చెందిన బిదీష మాఝీ 95వ ర్యాంక్ సాధించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News