Monday, June 16, 2025

నీట్‌లో కోటా… టాప్ 10 లో నలుగురు

- Advertisement -
- Advertisement -

కోటా : రాజస్థాన్ కోటాలోని అలెన్ కేరీర్ ఇనిస్టూట్‌కు చెందిన నలుగురు విద్యార్థులు నీట్ యుజి 2025 ఫలితాలలో ఘనత చాటారు. శనివారం జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టిఎ) నీట్ ఫలితాలను వెలువరించింది. ఇందులో కోటా ఇనిస్టూట్ విద్యార్థులు నలుగురు టాప్ 10లో నిలిచారు. కాగా ఈ శిక్షణా సంస్థకే చెందిన 39 మంది అగ్రశ్రేణి వంద మందిలో తమ చోటు దక్కించుకున్నారు. నీట్ ఫలితాలతో విద్యార్థులు దేశంలోని ప్రముఖ వైద్య కళాశాలలో ప్రవేశానికి అర్హత పొందుతారు. తమ శిక్షణా సంస్థ విద్యార్థులు టాప్ ర్యాంకులు దక్కించుకున్నందుకు సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి నితిన్ కుక్రెజ హర్షం వ్యక్తం చేశారు.

ప్రతిభ చాటుకున్న యువతకు అభినందనలు తెలిపారు. అలెన్ ఇనిస్టూట్‌కు చెందిన మృణాల్ ఝా ఆలిండియా స్థాయిలో నాలుగో ర్యాంక్ దక్కించుకున్నారు. ఇక అమ్మాయిల విభాగంలో ఆషి సింగ్ రెండో స్థానంలో నిలిచారని అలెన్ ఇనిస్టూట్ తమ ప్రకటనలో తెలిపింది. ఇక టాప్ 10లో చోటు దక్కించుకున్న వారిలో ఇద్దరు విద్యార్థులు కేశవ్ మిట్టల్ 7వ ర్యాంకు, సాధించారు. కేశవ్ అలెన్ అహ్మదాబాద్ బ్రాంచ్‌లో చదివాడు. ఇక భవ్య చిరాగ్‌కు 8వ వర్యాంక్ వచ్చింది. కోటాలోని ప్రవేశ పరీక్షల సంస్థలలో పరీక్షల మార్కుల కోసం విద్యార్థుల్లో ఒత్తిడి పెరుగుతోందని, ఈ క్రమంలో మానసిక చిక్కులు ఎదుర్కొలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఉదంతాల మధ్య ఇప్పుడు కోటా విద్యాసంస్థలు బంగారు విద్యా భవితల చదువులకు ప్రధాన ద్వారం అయిన విషయం ఇప్పటి ఫలితాలతో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News