- Advertisement -
నీట్ (యూజీ) పరీక్ష2025 ప్రిలిమినరీ కీ విడుదలైంది. మంగళవారం ప్రాథమిక కీ విడుదల చేసిన ఎన్టిఏ.. అభ్యర్థుల ఈ-మెయిల్ ఐడీలకు ఎంఆర్ ఆన్షర్ షీట్లను పంపినట్లు తెలిపింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలను తెలియజేసేందుకు అవకాశం కల్పిస్తూ.. దీనికోసం జూన్ 5వ తేదీ వరకు అవకాశమిచ్చారు. అయితే, అభ్యంతరాలు తెలిపేందుకు ఒక్కో ప్రశ్నకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. అభ్యంతరాలు సమీక్షించిన తర్వాత తుది ఫలితాలు విడుదలవుతాయి. ఆ తర్వాత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. కాగా, దేశ వ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు మే 4న నీట్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 20.8 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు.
- Advertisement -