- Advertisement -
నేరడిగొండ: దంపతులు మధ్య గొడవ జరగడంతో భార్య గొంతు నులిమి భర్త చంపిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… దరిబితండాలో నటరాజ్, సుజాత(21) అనే దంపతులు నివసిస్తున్నారు. భార్య భర్తల మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. బుధవారం రాత్రి భార్య, భర్త మధ్య గొడవ తారా స్థాయికి చేరుకోవడంతో ఆమె గొంతు నులిమి భర్త చంపేశాడు. అనంతరం అతడు పారిపోయాడు. దీంతో మృతురాలి జాతీయ రహదారిపై ఆందోళనకు దిగారు. అడ్డు వచ్చిన పోలీసులపై దాడికి దిగడంతో ఎస్పి కాజల్ సింగ్ తన సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి బంధువులతో మాట్లాడారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని కాజల్ సింగ్ తెలిపాడు. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -