Saturday, June 14, 2025

వన్డేలలో భారీ ఛేజింగ్.. భారత్, ఇంగ్లండ్ రికార్డులను బ్రేక్ చేసిన నెదర్లాండ్స్

- Advertisement -
- Advertisement -

డండీ: వన్డే క్రికెట్ లో భారత్, ఇంగ్లాండ్ జట్ల రికార్డులను నెదర్లాండ్స్ జట్టు బద్దలు కొట్టింది. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ లీగ్ 2లో గురువారం (జూన్ 12) స్కాట్లాండ్‌పై 370 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించి నెదర్లాండ్స్ చరిత్ర సృష్టించింది. వన్డేల చరిత్రలో ఇది మూడవ అత్యధిక విజయవంతమైన ఛేజింగ్‌గా నిలిచింది. 2013లో జైపూర్‌లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ఆస్ట్రేలియాపై 360 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన భారత్, వెస్టిండీస్ పై 361 పరుగుల టార్గెట్ ను సాధించిన ఇంగ్లాండ్ రికార్డులను నెదర్లాండ్స్ బ్రేక్ చేసింది.

డండీలోని ఫోర్తిల్‌లో స్కాట్లాండ్ బ్యాట్స్‌మన్ జార్జ్ మున్సే కేవలం 150 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్సర్లతో 191 పరుగుల రికార్డు స్కోరు చేశాడు. దీంతో ఆ జట్టు 50 ఓవర్లలో 369 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే రికార్డు విజయం సాధించింది. నెదర్లాండ్స్ 300 కంటే ఎక్కువ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఇదే తొలిసారి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News