Thursday, July 31, 2025

కొత్త డిస్కం

- Advertisement -
- Advertisement -

దాని పరిధిలోకే వ్యవసాయం, గృహాలు, స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్
పథకాలు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగం విద్యుత్
విభాగం ప్రక్షాళనకు సంస్కరణలు డిస్కంలపై ఉన్న రుణభారాన్ని తగ్గించాలి
మూడేళ్లలో 2.10లక్షల మంది గిరిజన రైతులకు గిరి జలవికాసం పథకం
ఆరు లక్షల ఎకరాలకు సౌరవిద్యుత్ పంప్‌సెట్లు ఇంధనశాఖపై
సమీక్షా సమావేశంలో అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలు

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో విద్యుత్ విభా గం ప్రక్షాళన చేసేందుకు అవసరమైన సంస్కరణలు అమ లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్తగా మరో డి స్కంను ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన చర్య లు చేపట్టాలని అధికారులను సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఎన్‌పిడిసిఎల్, ఎస్పీడిసిఎల్‌తో పాటు కొత్తగా ఏర్పా టు చేసే డిస్కం పరిధిలోకి వ్యవసాయానికి ఉచిత విద్యు త్, 200 యూనిట్ల ఉచిత గృహ విద్యుత్, స్కూళ్లు, కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకు రావాలని సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రమంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కం పరిధి ఉండాలని ముఖ్యమంత్రి సూచనలు చేశారు. సిఎం రేవంత్‌రెడ్డి బుధవారం ఇంధన శాఖపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో కలిసి అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, సిఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, టిజి జెన్‌కో సిఎండి హరీష్, టిజిఎస్పీడిసిఎల్ సిఎండి ముషారఫ్, టిజిఎన్పీడిసిఎల్ సిఎండి వరుణ్ రెడ్డి, సింగరేణి సిఎండి బలరాం, టిజి రెడ్‌కో విసి అండ్ ఎండి అనిల, ఇతర ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

కొత్త డిస్కం ఏర్పాటుతో జాతీయ స్థాయిలో రేటింగ్…
ఈ సందర్భంగా సిఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ కొత్త డిస్కం ఏర్పాటుతో ఇప్పుడున్న డిస్కంల పనితీరు మెరుగుపడుతుందని, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని సిఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. డిస్కంల ఆర్ధిక స్థితిగతులను మెరుగుపరిచేందుకు సంస్కరణలు తప్పనిసరని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. డిస్కంల పునరవ్యవస్థీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడు ఉన్న రుణభారం తగ్గించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రుణాలపై వడ్డీ భారం తగ్గించేందుకు వెంటనే ప్రణాళిక సిద్ధం చేయాలని సిఎం రేవంత్ అదేశించారు.

10 శాతం వరకు వడ్డీ పై తీసుకున్న రుణాలతో డిస్కంలు డీలా పడ్డాయని ఈ రుణాలను తక్కువ వడ్డీ ఉండేలా రీ స్ట్రక్చర్ చేసుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి అదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సిఎం రేవంత్ సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలపై సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేయాలని, జిల్లాలవారీగా అనువైన భవనాలను గుర్తించే బాధ్యతను ఆయా జిల్లాల కలెక్టర్లకు బాధ్యత అప్పగించాలని అధికారులకు సిఎం రేవంత్‌రెడ్డి సూచించారు. యుద్ధప్రాతిపదికన అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

సచివాలయానికి సౌర విద్యుత్ అందించాలి
రాష్ట్ర సచివాలయానికి సౌర విద్యుత్ అందించాలని, వెంటనే ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆర్ అండ్ బి, విద్యుత్ శాఖ సమన్వయంతో తగిన ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ సూచించారు. ఎండాకాలంలో సచివాలయంలో వాహనాల పార్కింగ్ ఇబ్బందిగా మారిన నేపథ్యంలో సోలార్ రూఫ్ టాప్ షెడ్స్‌ను ఏర్పాటు చేయాలని, వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండేలా సోలార్ రూఫ్ టాప్‌ను డిజైన్ చేయాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. విద్యుత్ అవసరాలతో పాటు పార్కింగ్ ఇబ్బందులు తొలగిపోయేలా సచివాలయం చుట్టూ సోలార్ ఫెన్సింగ్, సోలార్ రూఫ్‌టాప్‌ను ఏర్పాటు చేయాలని అధికారులకు సిఎం సూచించారు. ఇందిర సోలార్ గిరి జల వికాసం పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన, ఆదివాసీ తండాలు, ఏజెన్సీ ఏరియాల్లో యుద్ధ ప్రాతిపదికన అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మూడేళ్లలో 2లక్షల 10వేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింపజేయాలని, 6 లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపుసెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలని సిఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News