- Advertisement -
ఉత్తరాఖండ్ నైనిటాల్ జిల్లాలో బుధవారం కారు కాలువ లోకి దూసుకెళ్లి నవజాత శిశువుతోసహా మొత్తం నలుగురు కుటుంబీకులు ప్రాణాలు కోల్పోయారు. హల్ద్వానీ లోని ఆస్పత్రి వద్ద బిడ్డ ప్రసవించిన తరువాత కుటుంబం కారులో కిచ్చాపట్టణానికి సమీపాన తమ ఇంటికి తిరిగి వస్తుండగా కారు కాలువ లోకి దూసుకెళ్లిందని పోలీసులు చెప్పారు. అప్పుడే పుట్టిన పసికందుతోసహా నలుగురు కుటుంబీకులు కారు లోనే మృతి చెందారు. ముగ్గురు గాయపడ్డారు. వీరిని ఆస్పత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రి పుష్కర్సింగ్ థామి సంతాపం తెలియజేశారు. గతవారం రుతుపవనాలు ప్రవేశించిన దగ్గర నుంచి భారీ వర్షాలతో ఉత్తరాఖండ్లోని అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల కొండచరియలు విరిగిపడ్డాయి.
- Advertisement -