- Advertisement -
ఇటీవల రాజేంద్రనగర్ పిఎస్లో ఆటోడ్రైవర్ మృతి చెందిన ఘటనను జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సి) సుమోటోగా తీసుకుంది. దీంతో రాష్ట్ర డిజిపి జితేందర్కు ఎన్హెచ్ఆర్సి నోటీసులు ఇచ్చింది. గత నెల 13 రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ లో ఆటో డ్రైవర్ మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపింది. పోలీసుల వేధింపుల వల్లే మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ క్రమంలో మీడియాలో వచ్యిన కథనాలను పరిగణనలోకి తీసుకున్న ఎన్హెచ్ఆర్సి.. గురువారం రాష్ట్ర డిజిపికి నోటీసులు ఇచ్చింది. ఆటో డ్రైవర్ మృతిపై రెండు వారాల్లో విచారణ చేసి పూర్తి నివేదికను ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
- Advertisement -