Thursday, June 12, 2025

మధ్యప్రదేశ్‌లో దారుణ నిర్భయ ఘటన

- Advertisement -
- Advertisement -

గిరిజన మహిళ వొళ్లంతా ఛిద్రం ..హత్యాచారం

భోపాల్ : మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వాలో నిర్భయ ఉదంతాన్ని తలదన్నే ఘటన జరిగింది. ఖాండ్వాలోని ఖాల్వా ఆదివాసీ ప్రాంతంలో గిరిజన మహిళ ప్రత్యక్ష నరకం అనుభవించి , దిక్కులేని చావుకు గురైంది. అక్కడి రోహిణి చౌక్‌లో మహిళపై సామూహిక మానభంగం జరిగింది, మర్మాయవంలో ఇనుపరాడ్ జొప్పించి అమానుష రీతిలో హింసించి ఈ ఇద్దరు పిల్లల తల్లిపై అత్యాచారం జరిగింది. తీవ్ర రక్తస్రావంతో ఆమె ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసింది.

ఘటన గురించి తెలియగానే అక్కడికి చేరుకున్న పోలీసులకు అపస్మారక స్థితిలో పడి ఉన్న మహిళ శరీర భాగాలు ఛిద్రం అయి పడి ఉండగా , పక్కన ఉన్న ఇంట్లో ఆమెను తొలుత ఆమె బిడ్డ కనుగొంది. శరీరం పక్కన గర్భాశయం వెలుపలికి వచ్చి ఉంది. అయినా కొన ఊపిరితో చిత్రవధకు గురైంది. ఘటన తెలియగానే గ్రామస్థులు గుమికూడారు. వారి ఫిర్యాదు మేరకుకేసు నమోదైంది. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గ్యాంగ్‌రేప్, హత్యాచారం గా కేసు నమోదు అయింది. బిజెపి ప్రభుత్వ మధ్యప్రదేశ్‌లో ఇప్పుడు జంగిల్ రాజ్ సాగుతోందని కాంగ్రెస్ పార్టీ నేత జితూ పట్వారీ వ్యాఖ్యానించారు. ఆదిమయుగపు ఆటవిక ధోరణితో గిరిజనులు, అణగారిన వర్గాలకు దిక్కు లేకుండా పోయిందని ఈ పిసిసి నేత స్పందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News