Thursday, June 12, 2025

హారర్ థ్రిల్లర్

- Advertisement -
- Advertisement -

మనోజ్ కుమార్, ఆశిత రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నిశ్శబ్ద. (Nishabdha) ఈ చిత్రాన్ని శ్రీరిషి సాయి ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రీనివాస్, ఎం.సంధ్యారాణి నిర్మిస్తున్నారు. హారర్ థ్రిల్లర్ కథతో దర్శకుడు రమణమూర్తి తంగెళ్లపల్లి రూపొందిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న నిశ్శబ్ద సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. మంగళవారం నిర్మాత శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర టీజర్ ను హైదరాబాద్‌లో ఘనం గా రిలీజ్ చేశారు. అనంతరం చిత్రబృందం కేక్ కట్ చేసి నిర్మాత శ్రీనివాస్ బర్త్ డే సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో యువ హీరోలు కృష్ణ, సంజయ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత శ్రీనివాస్ మాట్లాడుతూ “నిశ్శబ్ద టీజర్ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నా.

సినిమా కూడా అంతే బాగుంటుంది. త్వరలోనే మా మూవీని థియేటర్స్ లోకి తీసుకొస్తాం. ఇంకా నాలుగైదు ఆసక్తికరమైన మూవీస్ మా ప్రొడక్షన్ నుంచి రాబోతున్నాయి. ప్రస్తుతం ఆ చిత్రాలు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి”అని అన్నారు. డైరెక్టర్ రమణమూర్తి తంగెళ్లపల్లి (Ramanamurthy Tangellapalli) మాట్లాడుతూ “నిశ్శబ్ద చిత్రాన్ని హారర్‌గా థ్రిల్లర్ తెరకెక్కిస్తున్నాను. ఈ సినిమా చేసే క్రమంలో ప్రొడ్యూసర్ శ్రీనివాస్ ఎంతో సపోర్ట్ అందించారు. అందరి ఆదరణతో ‘నిశ్శబ్ద’ సినిమా త్వరలోనే థి యేటర్స్‌లోకి వచ్చి మంచి విజయాన్ని సాధిస్తుందని ఆశిస్తున్నా”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ని ర్మాత ఎం. సంధ్యారాణి, హీరో మనోజ్ కుమార్, హీరోయిన్ ఆశితరెడ్డి, సూర్య, నాగలక్ష్మిపాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News