Tuesday, June 24, 2025

శార్దూల్ కంటే అతడు చాలా బెటర్.. నెటిజన్లు ఫైర్

- Advertisement -
- Advertisement -

లీడ్స్: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో టీం ఇండియా మేనేజ్‌మెంట్ తీసుకున్న ఓ నిర్ణయంపై తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ మ్యాచ్ నితీశ్ కుమార్ రెడ్డికి బదులు శార్దూల్ ఠాకూర్‌ని (Shardul Thakur) తుది జట్టులోకి తీసుకున్నారు. అయితే శార్దూల్ రెండు ఇన్నింగ్స్‌లోనూ నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం ఒక పరుగు చేసి ఔట్ అయిన అతను.. బౌలింగ్‌లో 6 ఓవర్లు వేసి 38 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్‌లోనూ అతను ఫెయిల్ అయ్యాడు. 12 బంతులు ఎదురుకొని 4 పరుగులు చేశాడు.

దీంతో కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ సహా టీం మేనేజ్‌మెంట్‌పై నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. శార్ధూల్ ఠాకూర్ (Shardul Thakur) కంటే నితీశ్ కుమార్ రెడ్డి వంద రెట్లు బెటర్ అని అంటున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై అద్భుత ప్రదర్శన చేసిన నితీశ్‌ని పక్కన పెట్టాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. నితీశ్ జట్టులో ఉంటే కనీసం బ్యాటింగ్‌లో అయినా ప్రభావం చూపించి ఉండేవాడని పోస్ట్‌లు పెడుతున్నారు.

ఇక భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తుది దశకు చేరుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో రాహుల్ (137), పంత్ (118) పరుగులతో రాణించడంతో భారత్ 364 పరుగులు చేసి ఇంగ్లండ్ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌‌లో విజయం సాధించాలంటే.. ఆతిథ్య జట్టు మరో 350 పరుగులు చేయాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News