Friday, June 6, 2025

హీరోయిన్లు ఆట బొమ్మలు కాదు:నిత్యా మీనన్

- Advertisement -
- Advertisement -

హీరోయిన్ నిత్యా మీనన్ సోషల్ మీడియాలో ఒక్కోసారి ఉన్నట్టుండి ఫైర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు కూడా అలాంటి సందర్భమే వచ్చింది. తన తప్పు లేకుండా ట్రోలింగ్ చేస్తున్న ఓ బ్యాచ్ కు ఆమె తిరుగులేని కౌంటర్ ఇచ్చింది. ఇంతకీ విషయం ఏంటంటే.. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైంది నిత్యా మీనన్. అక్కడికి ఆమె అభిమానులు చాలామంది వచ్చారు. ఓ అభిమాని, ఆమెకు దగ్గరగా వెళ్లాడు. షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ నిత్యామీనన్ మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అతడికి రెండు చేతులతో నమస్కారం పెట్టి వెళ్లిపోయింది. ఆ వెంటనే స్టేజ్ ఎక్కిన ఆమె, ఓ నటుడిని మాత్రం కౌగిలించుకొని షేక్‌హ్యాండ్ ఇచ్చింది. దీనిపై చాలామంది ఆమెను విమర్శించారు. ఈ విమర్శలపై నిత్యా మీననే స్పందించింది. చాలామంది మమ్మల్ని ఈజీగా టచ్ చేయొచ్చనే ఆలోచనతో ఉంటారని, హీరోయిన్లు ఆట బొమ్మలు కాదనే విషయాన్ని అంతా గుర్తించాలంటూ కౌంటర్ ఇచ్చింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News