Saturday, June 28, 2025

జూలై 1 నుంచి ఆ వాహనాలకు పెట్రోల్, డీజిల్ బంద్!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: జీవితకాలం ముగిసిన వాహనాలకు ఢిల్లీ ప్రభుత్వం షాక్ ఇవ్వనుంది. ఆ వాహనాలకు జూలై 1, 2025 నుండి ఆయిల్ పంపుల వద్ద ఇంధనాన్ని నిషేధించేందుకు ఢిల్లీ ప్రభుత్వం రెడీ అయ్యింది. అలాంటి వాహనాలకు ఇంధనాన్ని నింపకుండా ఉండేందుకు.. ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (DTIDC) ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ (ANPR) కెమెరా సిస్టమ్‌ల సహాయంతో ఇంధన స్టేషన్‌లకు వచ్చే వాహనాలను పర్యవేక్షిస్తుంది. కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) ఆదేశం ప్రకారం, అన్ని జీవితకాలం ముగిసిన (EOL) వాహనాలను వాటి రిజిస్ట్రేషన్ తో సంబంధం లేకుండా ఢిల్లీలో ఇంధనం నింపడంపై నిషేధం విధించనున్నారు.

కాగా, నిబంధనల ప్రకారం, వాహన యజమానులు మొదటిసారి అఫిడవిట్ సమర్పించిన తర్వాత వారి కార్లను తీసుకెళ్లడానికి అనుమతించబడతారు. కానీ రెండవసారి.. అలాంటి వాహనాలను వెంటనే జప్తు చేస్తారు. ఢిల్లీ-NCR ప్రాంతంలో జీవితకాలం ముగిసిన వాహనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నివేదికల ప్రకారం, ఢిల్లీలో జీవితకాలం ముగిసిన బైకుల సంఖ్య 62 లక్షలు ఉండగా.. నాలుగు టైర్ల వాహనాల సంఖ్య 41 లక్షలు. ఇక, NCR (నేషనల్ క్యాపిటల్ రీజియన్)ను పరిగణనలోకి తీసుకుంటే.. హర్యానాలో సుమారు 27.5 లక్షల వాహనాలు, ఉత్తరప్రదేశ్‌లో 12.4 లక్షలు, రాజస్థాన్‌లో 6.1 లక్షల వాహనాలు జీవితకాలం ముగిసిపోయాయి. 2018లో, సుప్రీంకోర్టు ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నిషేధించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News