ఫార్ములా ఈకార్ రేసు కేసులో
కెటిఆర్కు న్యాయవాదుల సలహా
కోర్టు తీర్పు లేకుండా విచారణకు
వ్యక్తిగత ఫోన్లు ఇవ్వాల్సిన
అవసరం లేదని స్పష్టీకరణ
ఈకార్ రేసు ప్రభుత్వం
నిర్వహించిన కార్యక్రమం
ఇందులో వ్యక్తిగతంగా కెటిఆర్
పాత్ర నామమాత్రమని వివరణ
మొబైల్ ఫోన్లు అడిగే హక్కు
ఎసిబికి లేదని తేల్చిన లాయర్లు
మన తెలంగాణ/హైదరాబాద్: ఫార్ములా ఈ విచారణ సందర్భంగా ఎసి బికి కెటిఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్టాప్ ఇవ్వాలన్న అంశంపై ఆయ న న్యాయవాదులతో కలిసి చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం న డుస్తున్న విచారణ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో నిర్వహించిన క్రీడా కార్యక్ర మానికి సంబంధించినదని, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న తర్వాత రేసు నిర్వహణ పూర్తిగా అధికార యంత్రాంగం ద్వారా సాగిందని కెటిఆర్ న్యాయవాదులు ప్రాథమికంగా పేర్కొన్నారు. ఎసిబి ఆదేశాలపై మంగళ వారం కెటిఆర్ న్యాయవాదులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా న్యాయవాదులతో కెటిఆర్ ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన న్యాయ పర మైన అంశాలను చర్చించారు. కెటిఆర్తో సమావేశం అనంతరం న్యాయ వాదులు ఫార్ములా ఈ కేసుకు సంబంధించిన అంశాలను వెల్లడించారు.
ఫార్ములా ఈ వ్యవహారంలో కెటిఆర్ వ్యక్తిగతంగా పరిమిత పాత్ర మాత్రమే వహించారని న్యాయవాదులు తెలిపారు. ఫార్ములా ఈ కేసు అనేది ప్రభుత్వ లావాదేవీకి సంబంధించినదే తప్ప, వ్యక్తిగత సంభాషణకు సంబంధించి కాదు అని న్యాయవాదులు స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించిన అవగాహన ఒప్పందాలతో పాటు ఆయా సంస్థలతో జరిగిన ఒప్పందాలన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నాయని, జరిగిన ప్రతి నగదు లావాదేవీ అధికారికంగా బ్యాంకుల ద్వారా జరిగినప్పుడు, అప్పట్లో మంత్రిగా ఉన్న కెటిఆర్ వ్యక్తిగత సమాచారం అడిగే హక్కు ఎసిబికి లేదని చెప్పారు. ఇవన్నీ ప్రభుత్వానికి అందుబాటులో ఉన్న సమయంలో కేవలం రాజకీయ వేధింపుల కోణంలో మొబైల్ ఫోన్ అడగడం వెనుక న్యాయసమ్మతమైన కారణాలు ఏమీ లేవు అని న్యాయవాదులు పేర్కొన్నారు.
కోర్టు తీర్పు లేకుండా వ్యక్తిగత ఫోన్లను ఇవ్వాల్సిన అవసరం లేదు
విచారణ సంస్థలు ఒక పౌరుడి నుండి సేకరించిన సమాచారాన్ని తిరిగి అదే పౌరునిపై వాడే కుట్ర చేయడం అన్యాయమని గతంలో హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చాయని న్యాయవాదులు గుర్తు చేశారు. పైగా, వ్యక్తిగతంగా వాడే ఫోన్లను ఎలాంటి కోర్టు తీర్పు లేకుండా, వాటితో నేరుగా ఆరోపణల సంబంధం లేనప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అంతేకాక, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం, ఐటీ చట్టం ప్రకారం, ప్రైవసీ హక్కులకు విఘాతం కలిగించేలా ఉంటుందని తెలిపారు. ఈ చట్టాల ప్రకారం కేవలం కోర్టు తీర్పు ఉన్నప్పుడు మాత్రమే విచారణ సంస్థలు మొబైల్ ఫోన్, ల్యాప్టాప్ లాంటి వ్యక్తిగత డివైసులు అడగవచ్చని వివరించారు. ఎలాంటి ప్రజాప్రయోజనం లేని సందర్భంలో విచారణ సంస్థలు ఇలాంటి ఆదేశాలు ఇవ్వలేవని పేర్కొన్నారు. ఎటువంటి నిధుల దుర్వినియోగం లేకుండా, స్కాం లేని పరిస్థితిలో ఈ కేసు పూర్తిగా రాజకీయ వేధింపుల కోణంలో జరుగుతోందని స్పష్టంగా పేర్కొన్నారు.