Wednesday, June 4, 2025

నోటీసులు కాదు.. సస్పెండ్ చేయండి

- Advertisement -
- Advertisement -

అప్పుడు అందరి జాతకాలు బయటపెడతా
మరోసారి బిజెపిపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
నోటీసులు ఇవ్వాలనే యోచనలో అధిష్టానం..?

మన తెలంగాణ / హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ అధిష్టానం తనకు నోటీసులు ఇచ్చే కన్నా సస్పెండ్ చేయాలని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. సస్పెండ్ చేస్తే ఎవరి వల్ల పార్టీకి ఎక్కువ నష్టం జరుగుతుందో అందరి జాతకాలు బయటపెడతానని వివాదాస్పద వ్యాఖ్య లు చేశారు. నిత్యం వివాదాల్లో ఉండే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు.

కొన్ని మీడియా వర్గాల్లో రాజాసింగ్‌కు పార్టీ నాయకత్వం నోటీసులు ఇచ్చేందుకు యోచిస్తోందంటూ వస్తున్న వార్తలపై రాజాసింగ్ స్పందిస్తూA ఈ వ్యా ఖ్యలు చేశారు. ఇటీవల బిఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీజేపీ -బీఆర్‌ఎస్ పొత్తు ఆరోపణలను సమర్థిస్తూ, మంచి ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరతారని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. గతంలోనూ సొంత పార్టీపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం, ఆ తర్వాత పార్టీలో ఆయనపై నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత కొంతకాలంగా బిజెపి రాష్ట్ర నాయకత్వంపై ఆయన అసంతృప్తితో ఉన్నారు. కొన్ని నెలల కిందట అయితే నేరుగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డిపైనే ఆయన పరోక్ష విమర్శలు చేశారు.

పార్టీలో జిల్లా అధ్యక్షుల నియామకం, ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన రాజాసింగ్ పార్టీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పార్టీలో ఉన్న కొందరిని బయటకు పంపకపోతే ఎప్పటికీ బిజెపి అధికారంలోకి రాదని వ్యాఖ్యానించారు. బిజెపి ఎంపీలు, ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారని ఆ రోపించారు. పార్టీలో ఒకే కులం ఆధిపత్యం ఉం దని, అసమర్థ నాయకులను తొలగించాలని విపరీత ధోరణితో పార్టీలోని నాయకులపై వ్యాఖ్యలు చేయడం పెద్ద దుమారం చెలరేగింది.

మూడు రో జుల కిందట కేంద్రమంత్రి బండి సంజయ్‌ను ఉద్దేశించి పరోక్షంగా కరీంనగర్ నుంచే తనపై కుట్ర జరుగుతోందని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యా యి. ఎమ్మెల్సీ కవిత బీజేపీ- బీఆర్‌ఎస్ విలీనం గురించి చేసిన వ్యాఖ్యలను నిజమేనని, పెద్ద ప్యాకేజీ ఇస్తే బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరతారని, గతంలో ఇలాంటి పొత్తుల వల్ల బీజేపీ నష్టపోయిందని రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశా రు. ఈ నేపథ్యంలో బిజెపి కేంద్ర నాయకత్వం రాజాసింగ్ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని, రాష్ట్ర నాయకత్వాన్ని నోటీసులు జారీ చేయమని ఆదేశించినట్లు తెలుస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News