‘వార్ 2’ మూవీకి సంబంధించి 25వ నెం బర్కి ఓ ప్రత్యేకత ఉంది. భారతీయ సినీ ఇండస్ట్రీలో ఇద్దరు గొప్ప స్టార్స్ అయిన హృ తిక్ రోషన్, ఎన్టీఆర్లను ఒకే సినిమాలో నటింపజేసే అపూర్వ అవకాశాన్ని నిర్మాత ఆదిత్య చోప్రా సాధించారు. యశ్ రాజ్ ఫిలిమ్స్ రూపొందిస్తో న్న ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్లో భాగంగా తెరకెక్కుతున్న ‘వార్ 2’ను అయాన్ ముఖర్జీ దర్శక త్వం వహిస్తున్నారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ఇద్దరూ ఈ సంవత్సరం తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నారన్నది ఒక అద్భుతమైన విషయం.
ఇది యాదృచ్చికంగా జరిగినప్పటికీ ఈ ప్రత్యేక సందర్భాన్ని సెలబ్రేట్ చేసుకోవటానికి యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ ఏడాది అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమా ఈ సినిమా ట్రైలర్ను జూలై 25న విడుదల చేస్తోంది. ఇండియన్ సినీ ఇండస్ట్రీకి హృతిక్ రోషన్, ఎన్టీఆర్ చేసి న గొప్ప సేవలను అభినందిస్తూ యశ్ రాజ్ ఫిలి మ్స్ వార్ 2 మూవీ ట్రైలర్ లాంచ్ ప్రకటన విడుదల చేసింది. 2025లో ఇం డియన్ సినీ ఇండస్ట్రీ కి చెందిన ఇద్దరు గొప్ప స్టార్స్, తమ సినీ ప్రయాణంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నా రు.
ఇదొక లైఫ్ టైమ్ మూమెంట్స్. ఈ అరుదైన క్షణాలను గొప్పగా సెలబ్రేట్ చేసుకోవడానికి జూ లై 25న వార్2 ట్రైలర్ విడుదల చేస్తున్నట్లు యశ్రాజ్ ఫిలిమ్స్ తెలియజేస్తోంది. ఇద్దరు స్టార్స్ మ ధ్య జరిగే అద్భుత పోరాటం! జూలై 2ని మీ క్యాలెండర్లో ప్రత్యేకంగా మార్క్ చేసుకోండి” అని సంస్థ పేర్కొంది. వార్ 2 సినిమా హిందీ, తెలుగు, తమిళం భాషల్లో ఆగస్ట్ 14న ప్రపంచ వ్యాప్తంగా బారీగా విడుదలవుతుంది. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది.