Sunday, June 1, 2025

కిటికీ లోంచి రూ. 2 కోట్లు విసిరేసిన ఇంజనీర్

- Advertisement -
- Advertisement -

అక్రమంగా ఆర్జించిన ఓ ఒడిషా ఇంజనీరు తన ఇంటికి విజిలెన్స్ అధికారులు దాడికి రావడంతో హడావుడిగా దాదాపు 2 కోట్ల రూపాయల నోట్ల కట్టలను కిటికీలో నుంచి రోడ్డుపైకి విసిరేశాడు. ఆ రెండు కోట్ల రూపాయల నోట్లతో పాటు, మొత్తం 2 . 1 కోట్ల నగదును ఒడిశా విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భువనేశ్వర్ లో చీఫ్ ఇంజనీర్ బైకుంఠ నాథ్ సారంగి మొత్తాన్నికి విజిలెన్స్ అధికారులకు చిక్కాడు. బైకుంఠ నాథ్ లెక్కలలో చూపని ఆస్తులు ఎన్నో కూడగట్టాడని సమాచారం అందడంతో ఒడిశా విజిలెన్స్ బృందం ఆ యన నివసిస్తున్న ఫ్లాట్ కు చేరుకున్నారు. విజిలెన్స్ అధికారులను చూడగానే ఇంజనీర్ కిటికీలోంచి రూ. 500 నోట్ల కట్టలను విసిరేశాడు. సాక్షుల సమక్షంలో విజిలెన్స్ బృందం ఆ నోట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

అధికారులు భువనేశ్వర్, అంగుల్, పిపిలి( పూరి) లోని ఏడు ప్రదేశాలలో ఒకసారి ఆకస్మిక దాడులు జరిపారు. భుననేశ్వర్ లోని దుండు మా లోని ఒక ప్లాట్ నుంచి కోటి రూపాయలు, అంగుల్ జిల్లా కరడగాడియా లోని అతడి రెండు అంతస్తుల ఇంట్లో రూ. కోటీ పదిలక్షలు స్వాధీనం చేసుకున్నారు. అంగుల్ లోని విజిలెన్స్ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి జారీ చేసిన సెర్చ్ వారెంట్ల కింద ఈ సోదాలు జరిగాయి. విసృ్తత ఆపరేషన్ కు 8 మంది డిఎస్ పీలు, 12 మంది ఇన్ స్పెక్టర్లు, ఆరుగురు అసిస్టెంట్ సబ్ ఇన్ స్పెక్టర్లు, పలువురు సిబ్బంది నాయకత్వం వహించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News