- Advertisement -
హైదరాబాద్: ఆదివారం నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం (Fish Medicine) పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఆస్తమా బాధితులు ఈ మందు కోసం వచ్చారు. అయితే ఈ చేప ముందు పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటు చేసుకుంది. మెదక్ జిల్లా నుంచి చేప మందుకోసం వచ్చిన సత్యనారాయణ (75) ఆనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయారు. చేప మందు కోసం క్యూలైన్లో నిలుచున్న సత్య నారాయణకు గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వైద్యులు పరీక్షించి వెంటనే సిపిఆర్ చేసినప్పటికీ ఆయన ప్రాణాలు కాపాడలేకపోయారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
- Advertisement -