- Advertisement -
అహ్మదాబాద్: నగరంలో(Ahmedabad) ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 242 మంది ప్రయాణికులతో లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ అయిన కొంత సమాయానికే కుప్పకూలిపోయింది (Flight Crash). ఈ ఘోర ప్రమాదం జరిగిన వెంటనే పెద్ద ఎత్తున పేలుడు సంభవించి మంటలు చెలరేగాయి. అయితే తాజాగా ఈ విమాన ప్రమాదం నుంచి ఒకే ఒక్కరు బయటపడినట్లు అహ్మదాబాద్ సిపి తెలిపారు. 11ఎ నెంబర్ సీటులోని ప్రయాణికుడు ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు వెల్లడించారు. ప్రమాదం నుంచి బయటపడిన వ్యక్తికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రమాద మృతుల సంఖ్య గురించి ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. నివాస ప్రాంతంలో విమానం కూలినందు వల్ల మృతుల సంఖ్య ఎక్కువే ఉంటుందని పేర్కొన్నారు.
- Advertisement -