Tuesday, June 3, 2025

బిజెపి తప్ప తెలంగాణను ఏ పార్టీ కాపాడలేదు: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy) మరోసారి కాంగ్రెస్, బిఆర్‌ఎస్ పార్టీలపై విమర్శల వర్షం కురిపించారు. దేశాభివృద్ధిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్‌కు కిషన్‌రెడ్డి సవాల్ విసిరారు. బిఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ (Telangana) అభివృద్ధి చెందాలంటే డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలని అన్నారు. బిఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతం జరిగిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ జరుగుతోందన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానానికి డబ్బులు తెలంగాణ నుంచే వెళ్తున్నాయని పేర్కొన్నారు. బిజెపి తప్ప తెలంగాణను ఏ పార్టీ కాపాడలేదని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News