Sunday, September 14, 2025

ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్

- Advertisement -
- Advertisement -

దుబాయ్: ఆసియాకప్‌లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌ ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లోపడింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ (Pakistan) టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఆరంభంలోనే షాక్ తగిలింది. హార్థిక్ పాండ్యా వేసిన తొలి ఓవర్ మొదటి బంతిని వైడ్‌గా ఎక్స్‌ట్రా పరుగు రాగా.. మరోసారి వేసిన మొదటి బంతికి జట్టు ఓపెనర్ సైమ్ అయూబ్(0) బుమ్రాకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బుమ్రా వేసిన రెండో ఓవర్‌లో మహ్మద్ హారిక్(3) హార్థిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. దీంతో 2 ఓవర్లు ముగిసేసరికి పాకిస్థాన్ 2 వికెట్ల నష్టానికి 7 పరుగులు చేసింది. క్రీజ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్(2), ఫఖర్ జమాన్(1) ఉన్నారు.

Also Read : ఆసియాకప్: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News