Monday, May 5, 2025

పాక్ రెచ్చగొట్టే ప్రయత్నం.. సరిహద్దు వెంబడి మరోసారి కాల్పులు

- Advertisement -
- Advertisement -

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దాడిపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇప్పటికే భారత్ ప్రకటించింది. ఈ క్రమంలో పాక్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ.. 11 రోజులుగా నియంత్ర రేఖ(ఎల్ఓసి) వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. నిన్న రాత్రి జమ్ముకాశ్మీర్ లోని కుప్వారా, బారాముల్లా, పూంఛ్, రాజౌరీ, మెంధార్‌, నౌషేరా, సుందర్బానీ, అఖ్నూర్‌ ప్రాంతాల్లో పాక్ సైనికులు కాల్పులు జరిపింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ.. పాక్ కాల్పులను తిప్పికొట్టిందని ఉన్నతాధికి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News