Friday, June 27, 2025

దుండిగల్ లో టిప్పర్ లారీ బీభత్సం… ఒకటో తరగతి విద్యార్థి మృతి

- Advertisement -
- Advertisement -

దుండిగల్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిదిలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. మల్లంపేటలోని పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ముందు బాలుడి పైనుంచి టిప్పర్ వెళ్లడంతో అతడు ఘటనా స్థలంలోనే చనిపోయాడు. తల్లితో పాటు స్కూల్ కి వెళ్తున్న 1వ తరగతి బాలుడిని టిప్పర్ లారీ ఢీకొట్టి పైనుండి వెళ్లింది. దీంతో బాలుడు నుజ్జునుజ్జుగా మారి ఘటనా స్థలంలోనే చనిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మల్లంపేటలో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో పోలీసులు క్లీయర్ చేస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News