సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న కాంబినేషన్లో శేఖర్ కమ్ముల (Shekhar Kammul) దర్శకత్వంలో రూపొందుతున్న పాన్- ఇండియా మూవీ కుబేర. అద్భుతమైన తారాగణంతో కుబేర ఇండియన్ సినిమాలో గేమ్-ఛేంజర్గా నిలవబోతోంది. శేఖర్ కమ్ముల అమిగోస్ క్రియేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో కలిసి ఎస్విసిఎల్ఎల్పిపై సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు ఈ చిత్రాన్ని హై బడ్జెట్తో నిర్మిస్తున్నారు. కుబేర సినిమా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ “-ధనుష్ పాన్ ఇండియా స్టార్. ఆయన హిందీలో కూడా సినిమాలు తీశారు.
నాగార్జున కూడా ఎప్పటినుంచో హిందీ సినిమాల్లో ఉన్నారు. రష్మిక ఇండియాలో పాపులర్ హీరోయిన్. కథకి అనుగుణంగానే ఇంత బిగ్ స్టార్ కాస్ట్తో ఈ సినిమాని చేయడం జరిగింది. ధనుష్, నాగార్జున, రష్మిక అందరూ అద్భుతంగా నటించారు. -కుబేర తెలుగు, తమిళ్ స్ట్రయిట్ మూవీ. హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నాము. సినిమా అద్భుతంగా వచ్చింది. -శేఖర్ కమ్ముల మాకు చాలా ఇష్టమైన డైరెక్టర్. ఆయన లీడర్ సినిమా ఎప్పుడు చూసినా సరే చాలా ఫ్రెష్ గా అనిపిస్తుంది. ఈసారి మరింత బిగ్గర్ స్టార్ కాస్ట్తో ఈ సినిమా తీశారు. ఈ సినిమా కచ్చితంగా ఆడియన్స్కి కొత్త అనుభూతినిస్తుంది. చాలా డిఫరెంట్ మూవీ ఇది. -శేఖర్ కమ్ముల స్టార్స్ని క్యారెక్టర్స్గానే చూస్తూ సినిమా తీసే ఫిలిం మేకర్.
ఈ సినిమాలో కూడా క్యారెక్టర్స్ కనిపిస్తాయి. -శేఖర్ మంచి ఎమోషన్స్తో ఆడియన్స్ని టచ్ చేస్తూ ఫీల్ ఉండే సినిమాలను తీస్తారు. ఈ సినిమా కూడా అలాంటిదే. ఇందులో ఉండే విభిన్న భావోద్వేగాలు ఆడియన్స్కి కనెక్ట్ అవుతాయి. -రియల్ లొకేషన్స్లో షూట్ (Shoot locations) చేయడం ఎప్పుడూ కూడా సవాల్ తో కూడుకున్నదే. ఈ సినిమా కోసం అన్ని రియల్ లొకేషన్స్ లోనే షూట్ చేశాం. ముంబయ్లో సినిమాని షూట్ చేయడం మరో ఛాలెంజ్. రియల్ వీధుల్లో సినిమాని షూట్ చేయడం జరిగింది. అది రియల్ ఛాలెంజ్. -సినిమాని చాలా గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నాము. దాదాపు 1600 స్క్రీన్స్ లో సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా అద్భుతమైన ఓపెనింగ్స్ వస్తాయనే నమ్మకం వుంది”అని అన్నారు.