సంగారెడ్డి జిల్లా, మునిపల్లి మండలం, బుదేరా పంచాయతీ కార్యదర్శి నాగలక్ష్మి సోమవారం ఎసిబి అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళ్తే.. పెద్ద గోపులారం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుదెరా గ్రామంలోని తన స్వంత ప్లాట్లో ఇంటి నిర్మాణం చేపట్టేందుకు అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శిని సంప్రదించాడు. ప్లాట్కు సంబంధించిన అన్ని పత్రాలు సమర్పించారు. అయితే, ఇంటి నిర్మాణానికి అనుమతి ఇవ్వకుండా కార్యాలయం
చుట్టూ తిప్పుకుంటుండడంతో విసుగు చెందిన బాధితుడు తొందరగా ఇంటి పరిమిషన్ ఇవ్వాలని ఆమెను కోరాడు. ఇందుకు ఆమె కొంత డబ్బులు డిమాండ్ చేసింది. దీంతో రెండు రోజుల క్రితం ఎసిబి అధికారులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన అధికారులు పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శికి రూ.8 వేలు లంచం ఇస్తుండగా రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఎసిబి అధికారులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.