- Advertisement -
మన తెలంగాణ/మోత్కూర్: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మండలం లోని పాటిమట్ల గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. పాటిమట్ల హైస్కూల్ వద్ద సోమవారం సాయంత్రం ట్రాలీ ఆటో అదుపుతప్పి పల్టీలు కొట్టి ఓ వ్యక్తి పై పడడడంతో అతను మృతి చెందాడు. పాటిమట్ల గ్రామానికి చెందిన తిప్పబత్తిని రాజయ్య అదే సమయంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా పల్టీ కొట్టిన ఆటో అతనిపై పడింది. దీంతో తీవ్ర గాయాలైన రాజయ్యను చికిత్స కోసం భువనగిరి ఏరియా హాస్పటల్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -