Monday, June 9, 2025

‘పయనం’ ప్రారంభం

- Advertisement -
- Advertisement -

రోటి కపడా రొమాన్స్ చిత్రంతో కథానాయకుడిగా తనకంటూ ఓ గుర్తింపు పొందిన సుప్రజ్ హీరోగా, ‘జనక అయితే గనక’ చిత్రంలో తన అభినయంతో మెప్పించిన సంగీర్తన విపిన్ నాయికగా నటిస్తున్న నూతన చిత్రం ‘పయనం’ (payanam)ఆదివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ఛాయచిత్రాలు పతాకంపై చందురామ్ దర్శకత్వంలో స్వర్ణ కమల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్లపై చిత్రీకరించిన ముహుర్తపు సన్నివేశానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ క్లాప్ నివ్వగా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె కెమెరా స్వీచాన్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఇదొక కొత్త కాన్సెప్ట్‌తో రూపొందిస్తున్న చిత్రం.. డ్రామా సస్పెన్స్ థ్రిల్లర్‌ (Drama Suspense Thriller) గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చేసే అంశాలు చాలా ఉంటాయి. అవసరాల శ్రీనివాస్ మా చిత్రంలో ఓ ముఖ్యపాత్రలో కనిపిస్తారు. అంతేకాదు ప్రతి పాత్ర ఎంతో సహజంగా ఉంటుంది’ అని అన్నారు. నిర్మాత మాట్లాడుతూ.. “ఈతరం ప్రేక్షకులు మెచ్చే అంశాలతో రూపొందుతున్న ఓ వైవిధ్యమైన చిత్రమిది. మంచిర్యాల, తమిళనాడు, ఒరిస్సా పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ పూర్తిచేస్తాం’ అని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News