రైలు ప్రయాణం అంటే ప్రజలు ఎంతో ఇష్టపడతారు. ఎక్కువ మంది ప్రయాణం చేసే ప్రయాణ సాధనంగా ఉంటుంది. చిన్న పిల్లలకు, మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు, పేదలకు, పెద్దలకు అన్ని వర్గాల ప్రజలకు సౌకర్యవంతమైన సురక్షితమైన ప్రయాణ సౌకర్యం. హైదరాబాద్ నగరంలో నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ మూడు పెద్ద రైల్వేస్టేషన్లు ఉన్నాయి. ఇటీవల చర్లపల్లి రైల్వేస్టేషన్ను కలుపుకుంటే నాలుగు పెద్ద రైల్వే స్టేషన్లు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నాలుగు పెద్ద రైల్వేస్టేషన్ల (జంక్షన్ల) నుండి దేశంలోని వివిధ రాష్ట్రాలకు కొన్ని వేల మంది ప్రయాణికులు ప్రతి రోజూ వ్యాపార నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం, విధ్య, వైద్యం, విహార, విజ్ఞాన, వినోద తీర్థయాత్రలకు అనేక వేల మంది ప్రయాణికులు రైళ్లలో ప్రయాణం చేసి తమ గమ్యస్థానాలకు రాకపోకలు కొనసాగిస్తున్నారు.
ఇటీవల రైళ్లలో ప్రయాణం అంటే భయంకరమైన అనుభవాలు ఎదురవుతున్నాయి. రైళ్ళు శుభ్రంగా ఉండడం లేవు. రైళ్ళలో నీళ్ళు రావడం లేదు. మరుగుదొడ్లు శుభ్రపరచడం లేదు. టికెట్ కౌంటర్లలో టికెట్ ఇచ్చే రైల్వే సిబ్బంది తమ ఇష్టానుసారంగా డబ్బులు తీసుకుంటున్నారు. కాచిగూడ నుండి గద్వాలకు డ్బ్బై ఐదు రూపాయల టికెట్ తీసుకోవాలి. తుంగభద్ర ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి బయలుదేరి కర్నూలుకు వెళ్తుంది. ఉభయ తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుండి వేలాది మంది ప్రతిరోజూ వేరే వేరే పనుల మీద రాకపోకలు కొనసాగిస్తున్నారు. కాచిగూడ నుండి గద్వాలకు ఒక సారి డ్బ్భైఐదు, మరోసారి తొంభై, ఇంకోసారి వంద రూపాయలు తీసుకుంటున్నారు.
ఇదేమిటని అడిగిన ప్రయాణీకులమీద కస్సుబుస్సు అంటున్నారు. తుంగభద్రలో గత కొంతకాలంగా ఎప్పుడు చూసినా నీళ్ళు రావడం లేదు. రైళ్లలో దూర ప్రాంతాలకు వెళ్ళే ప్రయాణీకులు రిజర్వేషన్లు చేసుకుంటారు. రిజర్వేషన్లో లోయర్ బెర్త్, మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్ అని మూడు రకాలుగా ఉంటదనే విషయం మనందరికీ తెలిసిందే. రిజర్వేషన్ల కౌంటర్లలో ఉండే రైల్వే సిబ్బంది వృద్ధులకు అప్పర్ బెర్త్ కేటాయిస్తున్నారు. దీని వలన అనేక ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుంది. మహిళలకు ముఖ్యంగా చంటిపిల్లల తల్లులకు, వృద్ధులకు లోయర్ బెర్త్ కేటాయించాలి. కాని రైల్వే కౌంటర్లలో ఉన్న సిబ్బందికి చంటి పిల్లల తల్లులు, వృద్ధులు ఉన్నారని ఎంత బ్రతిమలాడిన మిడిల్ బెర్త్, అప్పర్ బెర్త్లను మాత్రమే కేటాయిస్తున్నారని ప్రయాణికులు ఆవేదనను, ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు.
మానవత దృక్పథంతో లోయర్ బెర్త్ కేటాయించాలని ఎంత బ్రతిమలాడిన చెవిటివాడి ముందు శంఖం ఊదిన చందంగా మారింది. తెలంగాణలోని శక్తిపీఠమైన ఆలంపూర్ జోగులాంబ దేవాలయం ఎంతో ప్రసిద్ధి. ప్రతిరోజు ఎంతో మంది భక్తులు జోగులాంబ అమ్మవారి దేవాలయానికి వస్తుంటారు. జోగులాంబ రైల్వేస్టేషన్ పేరు లేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం. ప్రతి రైల్వేస్టేషన్లో ఇరువైపుల పెద్ద పెద్ద పేర్లతో కూడిన బోర్డులు కన్పిస్తాయి. జోగులాంబ రైల్వే స్టేషన్లో ఎక్కడా జోగులాంబ రైల్వేస్టేషన్ అనే బోర్డు కన్పించదు.
జోగులంబ రైల్వేస్టేషన్ దగ్గర రైలు ఆగితే క్రాసింగ్ గురించి ఆగిందేమో అనుకుంటారు. కొద్ది దూరంలోనే ఆలంపూర్ రైల్వేస్టేషన్ ఉంది. కానీ అక్కడ రైలును ఆపరు. నేరుగా కర్నూలు రైల్వేస్టేషన్లోనే ఆపుతున్నారు. కర్నూల్ నుండి జోగులాంబ దేవాలయానికి ఆటోలలో లేదా కార్లలలో ప్రయాణించవలసి వస్తోంది. రైల్వే అధికారులు నిర్దిష్ట చర్యలు తీసుకొని జోగులాంబ రైల్వేస్టేషన్ బోర్డును ఏర్పాటు చేయాలని భక్తులు కోరుతున్నారు. సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ప్రయాణీకులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైలు ప్రయాణం సురక్షితంగా, సుఖవంతంగా, ఆనందంగా ఉండేటట్లు చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ఎస్. విజయ భాస్కర్, 92908 26988