తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి ఇటీవల హైదరాబాద్ కు వచ్చి సిటి విచారణకు హాజరైన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు నాలుగు సార్లు ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు.. తర్వాత ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాగ్మూలం రికార్డు చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో బిజెపి ఎంపి ఈటల రాజేందర్ తదితర నాయకుల స్టేట్ మెంట్ రికార్డు చేసిన సిట్.. తాజాగా చేవెళ్ల బిజెపి ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి సిట్కు వాంగ్మూలం ఇచ్చారు. దాదాపు గంటన్నరకు పైగా విశ్వేశ్వర్ రెడ్డి స్టేట్మెంట్ ను అధికారులు రికార్డు చేశారు. రాష్ట్రంలో మునుగోడు, దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో తన ఫోన్ ట్యాప్ అయినట్టు సిట్ అధికారులకు ఆయన చూపించారు. ఈటల రాజేందర్కు డబ్బులు ఇచ్చినట్టు తనపై నిందలు మోపారని.. తనతో పాటు తన భార్య సంగీత ఫోన్ సైతం ట్యాప్ చేశారని సిట్ కు తెలిపారు. ఫిర్యాదు చేస్తే తిరిగి తనపైనే నాన్బెయిలబుల్ కేసు పెట్టి ఇబ్బందులకు గురి చేశారని ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఎంపి కొండా విశ్వేశ్వర్రెడ్డి వాంగ్మూలం రికార్డు
- Advertisement -
- Advertisement -
- Advertisement -