Wednesday, June 18, 2025

ఫోన్ ట్యాపింగ్ కేసు.. రేపు సిట్ ముందుకు బిజెపి నేతలు!

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. గత వారం రోజులుగా ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన ప్రభాకర్ రావును విచారించిన సిట్ అధికారులు.. రేపు బిజెపి ఎంపిలు ఈటల, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావులను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వీరి ఫోన్లను ట్యాప్ చేసినట్లు సిట్ గుర్తించిన సిట్ అధికారులు.. 2023 నవంబర్ 15 నుంచి ఈ ముగ్గురి ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు సేకరించినట్లు సమాచారం. ముగ్గురు ఎంపిలతోపాటు పలువురు బిజెపి నేతలు, వాళ్ల ముఖ్య అనుచరులు, కుటుంబ సభ్యుల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు గుర్తించారు. ఎప్పటికప్పుడు బిజెపి నేతల రాజకీయ ఎత్తుగడలను తెలుసుకున్న ప్రభాకర్ రావు.. వారికి ఆర్థికసహాయం చేస్తున్న వారి ఫోన్ల ట్యాపింగ్..ఆయా నియోజకవర్గాల్లోని బిఆర్ఎస్ నాయకులకు సమాచారం ఇచ్చినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News