Sunday, June 15, 2025

మేడే ప్రమాదానికి ముందు ఎయిర్ ఇండియా పైలెట్ చివరి సందేశం

- Advertisement -
- Advertisement -

థ్రస్ట్ సాధించబడలేదు, పడిపోయింది, ఈ ప్రసార సమయంలో కమ్యూనికేషన్ లైన్చాలా బలహీనంగా ఉంది, మేడే – లండన్ కు బయలుదేరిన విమానం టేకాఫ్ అయిన నిముషానికే ఎయిర్ ఇండియా పైలెట్ అహ్మదాబాద్ విమానాశ్రయం లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటిసి)కి పంపిన చివరి సందేశం ఇదే. విమానాశ్రయం వర్గాలు ఈ విషయాన్నివెల్లడించాయి. గురువారం మధ్యాహ్నం 1.37 గంటలకు సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన విమానం ఏఐ-171 కూలిపోయిన తర్వాత విమానంలో ఏదో భారీ తప్పిదమే జరిగిందని ఎయిర్ ఇండియా పైలెట్ ఏటిసికి పంపిన సందేశం సూచన ప్రాయంగా తెలిపినట్లయింది.

లండన్ లోని గాట్విక్ విమానాశ్రయానికి అహ్మదాబాద్ నుంచి బయలుదేరిన ఆ విమానంలో 242 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, 10 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 241 మంది చనిపోయారు. భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ పౌరుడు విశ్వాస్ కుమార్ రమేశ్ మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విమానం అహ్మదాబాద్ శివారులో బిజి మెడికల్ కాలేజీ హాస్టల్, క్యాంటీన్ పై కుప్పకూలడంతో అందులోని విద్యార్థులు, సామాన్యులతో సహా మొత్తం 270 మంది మరణించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News