గాంధీనగర్: గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్లో గురువారం మధ్యాహ్నం ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. మేఘానిలో ఎయిర్ఇండియా విమానం కూలిపోయింది. సివిల్ ఆస్పత్రి సమీపంలో విమానం చెట్టును ఢీకొట్టిన అనంతరం జనావాసాలపై కూలింది. టేకాఫ్ అయిన వెంటనే విమానం కూలిపోయింది. అంబులెన్స్లు, ఫైరింజిన్లు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలిస్తున్నారు. బిఎస్ఎఫ్ సిబ్బంది సిబ్బంది సహాయకచర్యల్లో పాల్గొన్నారు. పరిసరప్రాంతాల్లో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. 242 మంది ప్రయాణికులతో ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 అనే విమానం అహ్మదాబాద్ నుంచి లండన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానంలో ఉన్న 242 మృతి చెంది ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గుజరాత్ కు బయల్దేరారు. ప్రమాదంపై గుజరాత్ సిఎంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి ఆరా తీశారు. విమానంలో మాజీ సిఎం విజయ్ రూపానీ ఉన్నట్లు సమాచారం.