Saturday, July 12, 2025

యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం: రేవంత్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించామని సిఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) తెలిపారు. సమాఖ్య విధానంలో కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం గౌరవించుకోవాలన్నారు. ఈ సందర్భంగా సిఎం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నామని, మూడు రంగాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలియజేశారు. అధిక వడ్డీలకు తీసుకున్న రుణాలపైన ఆందోళన వ్యక్తం చేశారు. అధికశాతం వడ్డీల (Most interest) కారణంగా రాష్ట్రాభివృద్ధి కుంటుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సంక్షేమం కోసం కృషి చేయాలని ఇలాంటి విధానం ద్వారానే, సమాఖ్య వ్యవస్థ బలోపేతమవుతుందని, దేశాభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. వడ్డీలు చెల్లించడం కోసమే రాష్ట్ర ఆదాయం ఖర్చు చేయాల్సి వస్తోందని, రుణాలపైన వడ్డీ తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News