టీం ఇండియా జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లండ్తో ఐదు టెస్టులు మ్యాచులు ఆడనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్లు రిటైర్మెంట్ ప్రకటించడంతో సీనియర్లు లేకుండానే ఈ సారి భారత జట్టు ఇంగ్లండ్తో తలపడుతోంది. దీంతో ఈ సిరీస్ భారత్కు ఎంతో ప్రతిష్టాత్మకమైంది. ఈ క్రమంలో జట్టులోని ఆటగాళ్లలో ఉత్సహాన్ని పెంచుందుకు కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gmabhir) అందరిని ఉద్దేశించి ప్రసంగించారు. జట్టు ముందు స్థితిని రెండు కోణాల్లో చూడొచ్చని గంభీర్ అన్నారు.. ఒకటి ముగ్గురు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు లేకుండా బరిలోకి దిగుతున్నామని.. రెండోది దేశానికి ఏదైనా ప్రత్యేకమైంది చేసే అవకాశం ఇదే అని ఆయన పేర్కొన్నారు.
‘‘ఈ జట్టులో ఆకాంక్ష, అభిరుచి, ప్రత్యేకంగా ఏదైనా చేయాలనే నిబద్ధత ఉందని భావిస్తున్నాను. మనం త్యాగాలు చేస్తే.. మన కంఫర్ట్ జోన్ నుంచ బయటకు వచ్చి పోరాడాలి.. ప్రతి సెషన్, ప్రతి గంట, ప్రతి బంతి మనం చిరస్మరణీయంగా మలుచుకోవాలి. ఆ పట్టుదలను ఈ రోజు నుంచే ప్రారంభించండి. దేశం కోసం ఆడటం కంటే గౌరవం మరొకటి లేదు’’ అని గంభీర్ (Gautam Gmabhir) అన్నారు. దీంతో పాటు జట్టులోకి కొత్త అడుగుపెట్టిన ఆటగాళ్లకు.. తొలిసారి కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన శుభ్మాన్ గిల్కు ఆయని అభినందనలు తెలిపారు.