ఫాట్నా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం జరిగిన మెగా వేలంలో రాజస్థాన్ రాయల్స్ తనని కొనుగోలు చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). తొలుత కొన్ని మ్యాచుల్లో ఆడే అవకాశం రాకపోయినా.. గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ సాధించి స్టార్డమ్ను తెచ్చుకున్నాడు. దేశం మొత్తం ఈ యువ కెరటాన్ని ప్రశంసలతో ముంచెత్తింది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ (Modi) వైభవ్ని కలిశారు.
ప్రస్తుతం బిహార్ పర్యటనలో ఉన్న ప్రధాని శుక్రవారం పాట్నా ఎయిర్పోర్ట్లో వైభవ్(Vaibhav Suryavanshi), అతని తల్లిదండ్రులను కలిశారు. ఈ విషయాన్ని ప్రధాని (Modi) తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. వైభవ్తో కాసేపు క్రికెట్కి సంబంధించిన విషయాలు మాట్లాడారు. అతను సాధించిన ఘనతలకు అభినందించారు. వైభవ్ సూర్యవంశీ భవిష్యత్ ప్రయత్నాలన్ని విజయవంతం కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నట్లు ప్రధాని పేర్కొన్నారు. అతను మరిన్ని ఉన్న శిఖరాలు అధిరోహించాలని, దేశానికి పేరు ప్రఖాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. వైభవ్కి తన ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ప్రస్తుతం వైభవ్ ప్రధానిని కలిసి ఫోటోలు వైరల్ అవుతున్నాయి.