- Advertisement -
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం విశాఖపట్నంకు చేరుకున్నారు. విమానాశ్రయంలో ఆయనకు గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటి సిఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వాగతం పలికారు. శనివారం విశాఖ ఆర్కే బీచ్ రోడ్డులో జరిగే యోగాంధ్ర కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. విశాఖ ఎయిర్పోర్టు నుంచి ఐఎన్ఎస్ డేగాకు చేరుకుని, అక్కడ నుంచి నౌకాదళ అతిథిగృహానికి వెళ్లి రాత్రికి అక్కడే బసచేశారు. శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉదయం ఆర్కే బీచ్లో నిర్వహించే యోగాసనాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఉదయం 11.50 గంటలకు దిల్లీకి వెళ్తారు.
- Advertisement -