Friday, June 6, 2025

బెంగళూరు తొక్కిసలాట: పెరుగుతున్న మరణాలు.. ప్రధాని మోడీ తీవ్ర విచారం

- Advertisement -
- Advertisement -

ఆర్సీబి విజయోత్సవ పరేడ్ తీవ్ర విషాదాన్ని నింపింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఇప్పటివరకు 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై ప్రధాని మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధాని ప్రార్థించారు. హృదయ విదారకమంటూ బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ప్రధానమంత్రి కార్యాలయం సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చోప్పున నష్ట పరిహారం ప్రకటించింది.

కాగా, నిన్న జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ పై గెలిచి తొలిసారి ఐపిఎల్ విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలిచింది. ట్రోఫీ గెలిచిన సందర్భంగా ఆర్సిబి జట్టు బెంగళూరులో విక్టరీ పరేడ్‌ ను నిర్వహించింది. అయితే, భారీగా అభిమానులు రావడంతో కంట్రోల్ చేయలేక పోలీసులు చేతులెత్తేశారు. ఈ క్రమంలో స్టేడియంలోకి అభిమానులు తోసుకుంటూ దూసుకెళ్లడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది.దీంతో బెంగళూరులో ఆర్సీబి విక్టరీ పరేడ్..తీవ్ర విషాదాన్ని నింపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News