Sunday, June 29, 2025

మహా అద్భుతం.. మన భారతం

- Advertisement -
- Advertisement -

మ్యాప్‌లో చూసినదానికన్నా చాలా పెద్దగా ఉన్నది భూమిపై
సరిహద్దులు లేవు..రాష్ట్రాలు లేవు..దేశాలు లేవు వసుధైక కుటుంబమే
కనిపిస్త్తున్నది అంతర్జాతీయ అంతరిక్షం కేంద్రం నుంచి భారత
వ్యోమగామి శుభాంశు శుక్లా ప్రధాని మోడీతో లైవ్‌లో సంభాషణ

ఐఎస్‌ఎస్ నుంచి: అంతరిక్షం నుంచి తనకు భారతదేశం అత్యద్భుతంగా కన్పిస్తోందని , ఏ దిక్కుకేగినా భారతీయతా ఖ్యాతి ఎనలేనిదన్పిస్తోందని గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లా తెలిపారు. ఇతర వ్యోమగాములతో కలిసి ఇప్పుడు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్)లో ఉన్న శుక్లా శనివారం భారత ప్రధాని నరేంద్ర మోడీతో ప్రత్యేక ఇంటర్నెట్ అనుసంధాన ప్రక్రియ ద్వారా మాట్లాడారు. ఐఎస్‌ఎస్‌కు చేరిన తొలి భారతీయుడుగా శుక్లా గుర్తింపు పొందారు. భూగోళ పటంతో పోలిస్తే తనకు భారత్ అతి పెద్దదిగా కన్పిస్తోందని శుభాంశు చెప్పారు. తను ఆరోగ్యంగా ఉల్లాసంగా ఉన్నానని, జీవితంలో ఇది తనకు ఓ అపూర్వ అనుభవం అని శుక్లా తెలిపారు. భారతీయుల తరఫున ఈ అత్యద్భుత అంతరిక్ష అనుభవం దక్కించుకోవడం తనకు గర్వకారణం అన్నారు.

భూ త లం నుంచి 400 కిలోమీటర్ల దూరంలో ఈ మజిలీకి తన ఈ ప్ర యాణం తన సొంతం కాదని, ఇది మొత్తం జాతి పయనం అని వ్యాఖ్యానించారు. ప్రధానితో మాట్లాడుతున్నప్పుడు ఆయనలో చెప్పలేనంత సంతోషం వెల్లివిరిసింది. తాను ఓ వ్యోమగామిని అవుతానని, ఇంతదూరం తరలివస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. అయితే మీ నాయకత్వంలో దేశం, ఈ దేశ యువత అనేక ఆకాంక్షలు కలలను నెరవేర్చుకునే స్థాయికి చేరుకుంటుందని, ఈ సమున్నత ప్రయాణం ఇందుకు ఉదాహరణ అని ప్రధానికి తెలిపారు. జాతి తరఫున శుక్లాకు ప్రధాని అభినందనలు తెలిపారు. నువ్వు చరిత్ర సృష్టించావయ్యా.. 140కోట్ల మందికి గర్వకారణంగా నిలిచావని కొనియాడారు. పేరుకు తగ్గట్లుగానే జర్ని ఉందని చమత్కరించారు. శుభాంశు ద్వారా భారత దేశ అంతరిక్ష పరిశోధనలు, ప్రయాణాలు శుభారంభం అవుతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News